రాజకీయ భవిష్యత్‌పై గంటా కీలక సమావేశం

1548చూసినవారు
రాజకీయ భవిష్యత్‌పై గంటా కీలక సమావేశం
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తన నివాసంలో ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. తన రాజకీయ భవిష్యత్‌పై వారితో చర్చించనున్నారు. అయితే చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం గంటాను ఆదేశించింది. కానీ ఆయన విశాఖ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే చేయమని లేదంటే పార్టీ కోసం పనిచేయమని హైకమాండ్ ఆదేశించింది. ఈ క్రమంలో ముఖ్యనేతలతో సమావేశమై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్