తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో భాగంగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ సింగ్ నగర్లో రాంబాబును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే నోటీసులు లేకుండా తనను పోలీసులు విచారణకు తీసుకెళ్లారని రాంబాబు గురువారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు.