ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి

579చూసినవారు
ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ పుణెలోని భారతీ ఆస్పత్రిలో చేరారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బుధవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భారత్‌కు రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్