కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ వంటి వ్యక్తులు వారిపై ఉన్న కేసుల గురించి మాట్లాడడానికే ప్రధాని మోదీ వద్దకు వెళతారని.. అలాంటి వారికి మోదీ గౌరవం ఇవ్వరని, కానీ తాను వెళితే మోదీ ఎంతో గౌరవం ఇస్తారని పవన్ వెల్లడించారు. మోదీ వద్ద తాను ధైర్యంగా మాట్లాడగలనని, మోదీ వద్ద మాట్లాడాలంటే జగన్ కు భయం అని ఎద్దేవా చేశారు. జగన్ వంటి వ్యక్తులను మోదీ ఖచ్చితంగా శిక్షిస్తారని పవన్ పేర్కొన్నారు. .