మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రద్దీగా ఉండే ప్రాంతంలో బైక్పై వెళుతున్న దంపతులను స్కార్పియో కారు ముందుగా ఢీకొట్టింది. మహిళ పక్కకు పడిపోయింది. అయితే కారు బానెట్పై ఉన్న వ్యక్తిని కారు డ్రైవర్ 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. అనంతరం బాధితుడు రోడ్డుపై పడిపోయాడు. అతడిని పట్టించుకోకుండా కారు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.