రాహుల్ గాంధీ ప్రకటనలను మోదీ వక్రీకరిస్తున్నారు: జైరాం రమేష్

70చూసినవారు
రాహుల్ గాంధీ ప్రకటనలను మోదీ వక్రీకరిస్తున్నారు: జైరాం రమేష్
ప్రధాని మోదీ పూర్తి నిస్సహాయతలోకి కూరుకుపోయారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మండిపడ్డారు. 'ప్రధాని దురుద్దేశంతోనే రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి వ్యాఖ్యను వక్రీకరిస్తున్నారు. మతపరమైన భావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ' అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమనే మోదీ గ్రహించారు. ఆ నిరాశను అధిగమించేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ఇటువంటి ప్రసంగాలు చేయడం నిజంగా సిగ్గుచేటని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్