వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ డబ్బులు ఇచ్చేటప్పుడు వలంటీర్లు లబ్ధిదారుల నుంచి కొంత కమిషన్ తీసుకున్నారన్న వార్తలు వచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో దాదాపు 6 వేల మంది పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు మీ ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. వలంటీర్లు లేకపోయినా ఎక్కడా కూడా ఈరోజు పింఛన్ల పంపిణీ ఆగలేదు అని వెల్లడించారు.