కేంద్రంలోని NDA ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము పోరాడుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పోరాడితే అణచివేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. నా ఎంపీ పదవిని, ఇంటిని లాగేసుకున్నారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలచే ఇబ్బందులకు గురిచేశారు’ అని అన్నారు.