కర్ణాటక సీఎం మార్పు జరగబోతోందనే ప్రచారంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఇది ప్రజల మధ్య చర్చించాల్సిన వ్యవహారం కాదని పేర్కొన్నారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కాగా, సిద్ధరామయ్యను పక్కనపెట్టి డీకే శివకుమార్ కు పాలనా పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే సీఎంను మార్చుతారనే వ్యాఖ్యలను ఆయన ఖండించకపోవడంపై హాట్డిబేట్ సాగుతోంది.