గుడివాడ మేమంతా సిద్ధం బహిరంగసభలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ 'నా నుదిటి మీద వాళ్ళు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమోగానీ.. పేదలకి చంద్రబాబు చేసిన గాయాలను వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు పన్నడం చంద్రబాబు నైజమైతే.. మీ ఇంటింటికీ మంచి చేయడం మీ బిడ్డ జగన్ నైజమని చెప్పడానికి గర్వపడుతున్నా. 58 నెలల్లో ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్క్ పాలన కనిపిస్తోంది' అని అన్నారు.