వైసీపీకి మరోసారి ఓటు వేస్తే ప్రజల్ని కూడా అమ్మేస్తారని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. "మద్యపాన నిషేధమంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. వైసీపీ పాలనతో రైతులు అప్పులపాలయ్యారు. సామాజిక న్యాయం అంటూ ఊదరగొడుతున్న జగన్.. అమ్మఒడిలో కోతలు ఎందుకు పెట్టారు?" అని పలమనేరు సభలో షర్మిల ప్రశ్నించారు.