లోక్సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో 200 సంకల్ప్ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగట్టనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత గోపాల్రాయ్ వెల్లడించారు. నాలుగు లోక్సభ స్థానాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సభలు జరుగుతాయని.. వీటిలో ఆప్ సీనియర్ నేతలు, మంత్రులు పాల్గొంటారని తెలిపారు.