ఏపీలో ప్రతి వ్యవస్థని వైసీపీ నాశనం చేసిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా తమతో టచ్లో ఉన్నారని చెప్పారు. కూటమి గేట్లు ఎత్తితే జగన్ తప్ప వైసీపీలో ఎవరూ మిగలరని అన్నారు. కానీ తమ నాయకుడు చంద్రబాబు ఎవరినీ చేర్చుకోబోమని చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ తిరిగి అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.