AP: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎవరైనా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. "కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తాయి. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూదు." అని మీనా పేర్కొన్నారు. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన ఈ మేరకు మాట్లాడారు.