దేశం కోసం 100 సార్లయినా జైలుకు వెళ్తా: కేజ్రీవాల్

56చూసినవారు
దేశం కోసం 100 సార్లయినా జైలుకు వెళ్తా: కేజ్రీవాల్
దేశం కోసం 100 సార్లయినా జైలుకి వెళ్లడానికి సిద్ధమేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘నేను స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అనుచరుడిని. దేశం కోసం ఎన్ని సార్లయినా జైలుకి వెళ్తా. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్ల కంటే తక్కువ గెలుచుకుంటుంది. ఇండియా కూటమి 300 సీట్లకు పైగా గెలుచుకుంటుంది. నేను అవినీతికి పాల్పడ్డానని బీజేపీ ఆరోపిస్తోంది. కానీ సాక్ష్యాలు చూపించలేకపోతోంది’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్