స్కూటీ డిక్కీలో ఉంచిన రూ.2 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్లో చోటుచేసుకుంది. స్థానిక ఇందిరాచౌక్ ఎస్బీఐ వద్ద స్కూటీ డిక్కీలో ఓ మహిళ నగదు ఉంచింది. అయితే ఆ నగదు అపహరించారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.