ఏపీలో 43 లక్షల మందికి ఓటు హక్కే లేదట!

84చూసినవారు
ఏపీలో 43 లక్షల మందికి ఓటు హక్కే లేదట!
భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది. అయితే ఏపీలో దాదాపు 43 లక్షల మందికి ఓటు హక్కు లేదు. 2021-22 గణంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఓటు హక్కు లేనివారి సంఖ్య 43 లక్షలుగా ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. సంచార జాతులవారు, వలస కార్మికులు, భిక్షాటన చేసేవారు, నిరాశ్రయులు ఓట్ల పండుగకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్