మరో రెండు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటన

78చూసినవారు
మరో రెండు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటన
ఏపీలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మరో రెండు జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవులు ప్రకటించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ఇస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటికే గుంటూరు జిల్లాలో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్