ఏపీలో రేపు ఉదయం ఇంటర్ ఫలితాలు

75చూసినవారు
ఏపీలో రేపు ఉదయం ఇంటర్ ఫలితాలు
ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు (శుక్రవారం) ఉదయం విడుదల కానున్నాయి. ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ఏర్పాట్లు చేసింది. మార్చి1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 4వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్