వైసీపీ రాష్ట్రానికి అవసరమా?: చంద్రబాబు

558చూసినవారు
వైసీపీ రాష్ట్రానికి అవసరమా?: చంద్రబాబు
జగన్‌ సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైందని పీలేరు ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాకోర్టులో వైసీపీను శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పారు. ‘‘ఎన్నికలు వచ్చినప్పుడే జగన్‌ ప్రజల్లోకి వస్తున్నారు. ఆయనకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. వైసీపీ రాష్ట్రానికి అవసరమా? మీ కసినంతా ఎన్నికల సమయంలో జగన్‌కు చూపించాలి. వచ్చేది యుద్ధం.. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. గెలిచేది టీడీపీ-జనసేననే’’ అని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్