కర్నూల్ జిల్లా ప్రత్తికొండ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ..'ఈ ప్రభుత్వం ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేసిందా? కర్నూలు జిల్లాకు సాగునీరు అందిస్తాం. బీసీలను అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత నాది. జగన్ పాలనలో బీసీలపై దాడులు జరిగాయి. వైసీపీను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారు. యువగళం కింద ఏటా 4 లక్షల
ఉద్యోగాలు భర్తీ చేస్తాం' అని హామీనిచ్చారు.