ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని
వైసీపీ నేత కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ 124 సార్లు బటన్ నొక్కారని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ సంక్షేమాన్ని ఆపలేదని కొనియాడారు. ప్రజలకు మేలు చేసిన జగన్ను మరోసారి గెలిపించుకుంటామని చెప్పారు.