తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా, అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పాతపట్నంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారన్నారు. రైతుల పొలాల్లో సర్వే రాళ్లపైనా జగన్ తన ఫొటో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సిక్కోలు వాసులకు మేం అధికారంలోకి వచ్చాక స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.