టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బాగంగా చేపట్టిన ప్రజాగళం సభలకు రెండు రోజులు బ్రేక్ పడింది. ఇవాళ బాపట్ల నుంచి నేరుగా హైదరాబాద్కు చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై టీడీపీ నేతలతో రెండు రోజుల్లో సమీక్షించుకోనున్నారు.