వాహనదారులకు గుడ్ న్యూస్

63చూసినవారు
వాహనదారులకు గుడ్ న్యూస్
దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్ న్యూస్ అందించింది. సోమవారం నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ ఛార్జీలు పెంచనున్నట్లు NHAI గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై లారీల యజమానులు, వాహనదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో టోల్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని NHAI వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఉన్న టోల్ రేట్లు కొనసాగుతాయని NHAI అధికారులు వెల్లడించారు

సంబంధిత పోస్ట్