AP: జూన్ 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. కన్నుల పండువగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రేపు లేదా ఎల్లుండి ప్రమాణ స్వీకార తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ సంస్కరణలు, అభివృద్ధిని కొనసాగిస్తామని పేర్కొన్నారు.