ఈ నెల 4న మాజీ సీఎం జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. అక్కడ సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కాగా టీడీపీ ఏజెంట్, సీఐపై దాడి కేసుల్లో పిన్నెల్లి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.