పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్

81చూసినవారు
పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రులైన ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఫామ్-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీ సూచించింది. నవంబర్ 23న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించనుంది. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, అదే నెల 30న తుది జాబితాను వెల్లడించనుంది.

సంబంధిత పోస్ట్