కోనసీమలో జనసేనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమలాపురం ఇన్ఛార్జ్ శెట్టి బత్తుల రాజబాబు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ.. ‘అమలాపురానికి జనసేన పార్టీ అన్యాయం చేసింది. పొత్తులో భాగంగా అమలాపురం టికెట్ టీడీపీకి కేటాయించారు. నాకు అమలాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. అందుకే పార్టీ క్రియాశీల సభ్యత్వానికి, పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలకు రాజీనామా చేశాను.’ అని అన్నారు.