
జమ్మలమడుగు: ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల గోడపత్రాలు విడుదల
యర్రగుంట్లలోని మార్క్స్ భవన్ లో ఏఐవైఎఫ్ నాయకులు ఏఐవైఎఫ్ జాతీయ 17వ మహాసభల గోడపత్రాలను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఈర్లముతక శరత్ మాట్లాడుతూ, దేశంలో ప్రతి పౌరుడికి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. యువత ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువజన హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. మే 15న తిరుపతిలో జరిగే బహిరంగ సభకు యువత తరలిరావాలని పిలుపునిచ్చారు.