వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు

274చూసినవారు
వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు
పుల్లెల శివప్రసాద్ రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోగల బాలాజీ నిరాశ్రయుల వసతి గృహంలో గల ఉన్నటువంటి వృద్ధులకు పుల్లెల శివప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పుల్లెల శివప్రసాద్ తండ్రి పుల్లెల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. మా కుమారుని గుర్తు చేసుకుంటూ అతని ద్వితీయ సంవత్సరీకం సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లెల శివప్రసాద్ రెడ్డి, కుటుంబ సభ్యులు, రాజా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్