మీ విలువైన ఓటుతో వైసిపి విధ్వంస పాలనకు చరమగీతం పాడాలని జమ్మలమడుగు టిడిపి ఇన్ ఛార్జ్ సి. భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. జమ్మలమడుగు పరిధిలోని కన్నెలూరు 9వ వార్డులో సోమవారం ఆయన పర్యటించారు. పలు కుటుంబాలు టిడిపిలో చేరాయి. ఆయన మాట్లాడుతూ సంక్షేమం అనే పేరుతో రాష్ట్రాన్ని
జగన్ నాశనం చేశారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కనపడడం లేదన్నారు. మనతోపాటు మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే టిడిని గెలిపించాలని కోరారు.