టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

570చూసినవారు
టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి
భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డిని గెలిపించాలని జమ్మలమడుగు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ ఛార్జ్ భూపేష్ రెడ్డి కోరారు. బుధవారం ఎర్రగుంట్ల మండల పరిధిలోగల గ్రామలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు, ఉపాధి కల్పన లేదని తెలిపారు.

ఏడాదికోసారి యువతకు జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పారని, ఇప్పుడు ఆ ఊసే లేదని విమర్శించారు. శాసన మండలినే రద్దు చేయాలని కోరిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. టీడీపీ బలపరిచిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్