పెట్రోల్ బంకును తనిఖీ చేసిన తహసీల్దార్

1634చూసినవారు
పెట్రోల్ బంకును తనిఖీ చేసిన తహసీల్దార్
వినియోగదారులకు నాణ్యమైన పెట్రోలు కచ్చితమైన తూకంతో అందించాలని పెట్రోల్‌ బంకు నిర్వాహకులకు ఎర్రగుంట్ల మండల తహసీల్దార్ నాగేశ్వరరావు సూచించారు. బుధవారం సాయంత్రం ఎర్రగుంట్ల ముద్దునూరు రోడ్డులో గల పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేశామన్నారు. పెట్రోల్‌ బంక్‌ను తహసీల్దార్ నాగేశ్వరరావు పెట్రోల్‌ బంక్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్‌ బంకులో కొత్తగా ఇచ్చిన ఇన్స్‌స్పెక్షన్‌ తనిఖీల్లో భాగంగా ఆ పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యతా ప్రమాణాలు, తూకం, రేటు, భద్రతా ప్రమాణాలు, వినియోగదారులకు అందించాల్సిన ఉచిత సౌకర్యాలు గాలి పంపు, మంచి నీరు, టాయిలెట్స్‌ తనిఖీ చేశారు. వినియోగదారులు పెట్రోల్‌ బంకుల్లో ఉచితంగా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్