ప్రతి పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

59చూసినవారు
నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు, కార్యదర్శులు కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి తెలిపారు. సోమవారం కమలాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ భారతి అధ్యక్షతన పంచాయతీల విధులు, బాధ్యతలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాల నిర్వహణకు ఖర్చు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్