కమలాపురం: రతన్ టాటా భారతదేశ ధృవతార: ఎమ్మెల్యే కృష్ణ చైతన్య

58చూసినవారు
ప్రపంచం మొత్తం అభినందించే వ్యక్తి, కలియుగ కర్ణుడు, భారత జాతి రత్నం రతన్ టాటా విలువలతో కూడుకున్న మనిషి అని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి అన్నారు. గురువారం రతన్ టాటా మరణించడం అత్యంత దురదృష్టకరమని లక్షల కోట్లు సంపాదించుకునే వీలు వున్నా కూడా, వ్యక్తి కాదు దేశం ముఖ్యం అని నమ్మిన వ్యక్తి, ధృవతార రతన్ టాటా అని అన్నారు. అనంతరం రతన్ టాటా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్