మదనపల్లెలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

58చూసినవారు
మదనపల్లెలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లి మండలం వలసపల్లి కాట్లాటపల్లెకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. ఆదివారం రామచంద్ర మద్యం తాగి మోటారు బైకు నడపడంతో ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన రామచంద్ర ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి కారణమైన మరో వాహనదారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్