ప్రభుత్వ బంజరు భూములను దళితులకు, గిరిజనులకు పంచాలి

52చూసినవారు
ప్రభుత్వ బంజరు భూములను దళితులకు, గిరిజనులకు పంపిణీ చేయాలని బికేయంయు అన్నమయ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పండుగోల మణి, తోపు కృష్ణప్ప అధికారులను కోరారు. శుక్రవారం పుల్లంపేటలో సంఘం మండల ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మిగులు భూములు ఆక్రమించుకొని దొంగ పట్టాలు సృష్టిస్తున్నారని, మిగులు భూములను వెంటనే దళితులు, గిరిజనులకు పంచాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్