రాయచోటి: అమరవీరుల అంకితభావం వలన సురక్షితమైన సమాజం

55చూసినవారు
రాయచోటి: అమరవీరుల అంకితభావం వలన సురక్షితమైన సమాజం
పోలీసు అమరవీరుల ధైర్యం, నిబద్ధత, అంకిత భావాల వలన సురక్షితమైన సమాజం నిర్మించబడిందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరులైన పోలీసు వీరులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఘనంగా నివాళులను అర్పించారు.

సంబంధిత పోస్ట్