రాయచోటిలో చంద్రబాబు సభ సక్సెస్
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో గురువారం చంద్రబాబు నాయుడు సభ గ్రాండ్ సక్సెస్ అయిందని ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటిలో టిడిపి జెండా ఎగరవేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాంత్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కూటమితోనే రాష్ట్ర మండి రంగాలలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. రాంప్రసాద్ రెడ్డిని ఆఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.