జింబాబ్వే విద్యార్థినులకు డయేరియా: పరామర్శించిన కమిషనర్

84చూసినవారు
కాకినాడలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న జింబాబ్వే దేశానికి చెందిన ఏడుగురు విద్యార్థినులు డయేరియా బారిన పడ్డారు. వెంటనే వీరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. జింబాబ్వే నుంచి ఇక్కడకు వచ్చి డిగ్రీ చదువుతున్న వీరు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు గురువారం ఆసుపత్రికి చేరుకొని విద్యార్థినులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్