విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్డుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి అనుమతి లభించింది. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని చెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు కూడా ఫ్లైఓవర్కు అనుమతి లభించినట్లు తెలిపారు.