ఓటుహక్కును ప్రతి ఓటరూ వినియోగించుకోవాలన్న సందేశాన్నిస్తూ డా. బీఆర్. అంబేడ్కర్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ లేఖ గురువారం విడుదల చేశారు. ‘ప్రియమైన ఓటరులారా ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల పండుగలో అందరూ పాల్గొనాలని, జిల్లాలోని ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును నిస్వార్థంగా వినియోగించుకోవాలని’ లేఖలో పేర్కొన్నారు.