పి. గన్నవరం మండలంలోని మొండెపులంక గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రాలను శనివారం పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టి బాబు ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలకు మరిన్ని సేవలు అందిచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.