ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

72చూసినవారు
ఎగువన కురుస్తున్న భారీవర్షాలతో ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడం జరుగుతుందని, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియాకు తెలిపారు. 1500 క్యూసెక్కులతో ప్రారంభమైన అవుట్ ఫ్లో 20000 క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని రిజర్వాయర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని, అందుకే నీటిని విడుదల చేస్తున్నారని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. అధికారులు వారికి అండగా నిలవాలన్నారు.

సంబంధిత పోస్ట్