రాజమండ్రి: భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి- జిల్లా ఎస్పీ

51చూసినవారు
రాజమండ్రి: భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి- జిల్లా ఎస్పీ
దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడకు అమ్మవారి దర్శనార్థం కాలినడకన వెళ్లే భవానీను, భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తూ. గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ శుక్రవారం సూచించారు. జిల్లా పోలీసులు భక్తుల భద్రత దృష్ట్యా త్రాగునీరు, విశ్రాంతి తీసుకొనుటకు షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవి నగరంలోని ఏ. డి. బి రోడ్డు, గామన్ బ్రిడ్జ్, కొవ్వూరు టోల్గేట్, దేవరపల్లి, అనంతపల్లిలో అందుబాటులో ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్