భూ సమస్యల పరిష్కరణకు గ్రామ సభలు: ఎమ్మెల్యే బత్తుల

79చూసినవారు
భూ సమస్యల పరిష్కరణకు గ్రామ సభలు: ఎమ్మెల్యే బత్తుల
ప్రజల భూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాలలో భూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పేరిట గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. గురువారం కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులతో కలిసి ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్