సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదాం

84చూసినవారు
సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదాం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ లో మంగళవారం గొడారిగుంట, లక్ష్మి ఆసుపత్రి ఎదురుగా వందలాది వేద పండితులతో “ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం” కార్యక్రమం జరిగింది. నానాజీ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ 11రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష నుచేపట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్