వాడపల్లి వెంకన్న దర్శనం మహాభాగ్యం

78చూసినవారు
వాడపల్లి వెంకన్న స్వామి దర్శనం భక్తులకు మహాభాగ్యమని గుంటూరు పడమర ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఆమె కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే మాధవికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్