సీఎం చంద్రబాబు న్యాయం చేయాలని మహిళ ఆవేదన

50చూసినవారు
కోనసీమ జిల్లా ఆలమూరు మండలంకు చెందిన దళిత మహిళ గుర్రపు రాణి ప్రభుత్వం వారు ఇచ్చిన పట్టా భూమిని కొందరు అధికారులు కబ్జా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్న ఏ అధికారి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నాలుగు సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగిన తనకు న్యాయం జరగటం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడే తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్